కార్యక్రమాల ప్రచార పర్వమే ప్రాధాన్యం
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేని వ్యాపారం చుక్కాని లేని నావ లాంటిదని గుర్తించిన రాజకీయ పార్టీలు, నాయక ప్రతినిధులు. చేసే పని గురించి, చేసిన పని గురించి చెవిలో జొరీగలాగా పదే పదే ప్రజలకు తెలియజేయడమే ప్రధాన లక్ష్యంగా కృషి చేస్తేనే పార్టీకి గానీ, నాయకులకుగానీ గుర్తింపు రాదు. అందుకు ప్రధాన ప్రచార సాధనం సోషల్ మీడియా. సోషల్ మీడియా చేసే మేలు మరే ప్రచారానికి సాటిరాదు. తాజా తాజా మిర్చీ బజ్జీలలాగా ఒక పార్టీగానీ, ఒక రాజకీయ నాయకుని సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయడంలో సోషల్ మీడియాను మించినది మరొకటి లేదన్నది జగమెరిగిన సత్యం. గతంలో బిజెపి పార్టీ ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ప్రశాంత్ కిషోర్ లాంటి జాతీయ నాయకులు సోషల్ మీడియా ద్వారానే అధికార చక్రం తిప్పగలిగే స్థాయికి ఎదిగారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆకోవలోకి రావడానికి వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తొలి నుంచే సోషల్ మీడియా అవగాహన కలిగి ఉండడంతో తాను చేసే కార్యక్రమాల మాలను ప్రజల చెంతకు పకడ్బందీగా చేరవేయిస్తున్నారు. వికారాబాద్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 13 మందిని సోషల్ మీడియా ప్రతినిధులుగా నియమించారు. వికారాబాద్ పట్టణ పరిధిలో 4, వికారాబాద్ మండలంలో ఒకరు, ధారూర్ లో ఒకరు, మోమిన్పేట్ లో 2, మర్పల్లిలో ఒకరు, బంట్వారంలో 2, కోటపల్లిలో 2 చొప్పున నియమించారు.
సోషల్ మీడియా ప్రతినిధుల పనులు :
ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కు సంబంధించిన కార్యక్రమాల దినచర్య ప్రణాళికను పకడ్బందీగా రూపొందించడం. సద్విమర్శలను స్వీకరించడం. వ్యతిరేక అకారణ విమర్శలను ఎప్పటికప్పుడు సమయోచితంగా స్పందించడం. టిఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలను గడపగడపకు చేరవేయడం. ప్రజల నాడిని ఎప్పటికప్పుడు తెలుసుకొని తమ నాయకునికి ఉప్పందించడం వంటి పనులను చాకచక్యంగా నిర్వహించుటకు ఎమ్మెల్యే పలు దఫాలుగా సోషల్ మీడియా ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించారు.
సోషల్ మీడియా ప్రతినిధులు అందరితో కలుపుగోలుతనం :
పార్టీ కార్యకర్తల కంటే భిన్నమైన వ్యక్తులు సోషల్ మీడియా ప్రతినిధులు. అందరి విషయాలు, అన్ని విషయాలు రహస్యంగా సేకరించి తమ నాయకునికి చేరవేయడంలో అందెవేసిన చేయిలాగా వ్యవహరిస్తారు. సోషల్ మీడియా ప్రతినిధులు ఎవరికి శతృవులు కారు, మితృలు అంతకన్నాకారు. అలాగని తమ నాయకుని లక్ష్మణరేఖను జవదాటని అనుసంధానకర్తలు.
సోషల్ మీడియా నిర్వహించే వ్యక్తులు భాషా పరిజ్ఞానం, చతురత, సమయస్ఫూర్తి, స్పందించే చాకచక్యం అత్యంతావశ్యకం. వీరు ఏ చిన్న తప్పు చేసినా దాని ఫలితం మాత్రం వీరి నాయకుడు, పార్టీకి శిరోభారం మిగల్చకతప్పదు. సోషల్ మీడియా ప్రతినిధులు రాజకీయ పార్టీలకు, నాయకులకు అమ్ములపొదిలోని బాణాల్లాంటి వారు. వీరు స్పందించే తీరుపై రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మంచి చేయకపోయినా ఫరవాలేదు కానీ చెడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరుగకుండా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...