చట్ట సభలలో బీసీలకు రిజర్వేషన్లపై కెసిఆర్ పోరాడాలి
జన్నారం, ఫిబ్రవరి 13, ప్రజాపాలన: చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించుటకై ముఖ్యమంత్రి కేసీఆర్ పోరాడాలని సోమవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని సమావేశంలో ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బిసి కులాల పోరాట సమితి కో- కన్వీనర్ మామిడి విజయ్ అన్నారు. ఈ సందర్భంగా నేడు జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న స్వామి దేవాలయం సందర్శించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్న సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ తరపున బిసి హక్కులకై పోరాడాలని, అదేవిధంగా కొండగట్టు హనుమాన్ ఆలయ అభివృద్ధి కోసం 100 కోట్లు నిధులు తెలిపినందుకు ముఖ్యమంత్రి గారికి బీసీ అన్ని కుల వర్గాల తరపున ధన్యవాదాలు తెలుపుతున్న మన్నారు. దేశానికి స్వసంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినప్పటికీ చట్టసభలలో అసెంబ్లీలలో, పార్లమెంటులలో బీసీలకు రిజర్వేషన్లు లేకపోవడం వలన వందలాది బీసీ కులాల వారు ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా చట్టసభలలో అడుగుపెట్ట లేక పోతునరన్నారు. గత 75 ఏళ్లుగా పరిపాలన చేస్తున్న కాంగ్రెస్ బిజెపి పార్టీల స్వార్థ సంకుచిత రాజకీయాల వలన ఇలా జరుగుతుందన్నారు. దేశంలో ప్రతి ఉద్యమం వెనుక అగ్రవర్ణాల అండదండలతోనే కార్మికుల రైతు కూలీల రైతుల ఉద్యమాల వలననే హక్కులు సాధించుకోవడం సమస్యలు పరిష్కరించుకోవడం అనేది జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 2001 లో ప్రారంభించి 2014లో సాధించగలిగారన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వం పటిమ అటువంటిది అన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో రాజకీయాలలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించి ముఖ్యమంత్రి కెసిఆర్ టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చారన్నారు. అన్ని రాష్ట్రాలలో పార్టీని విస్తరించడానికి సభలు సమావేశాలు నిర్వహించ బోతున్నామన్నారు. తెలంగాణ ప్రజల కోసం రైతుబంధు, రైతు బీమా మొదలగు పథకాలను ప్రచారం చేస్తూ భారతదేశ స్థాయిలో ప్రజల మెప్పు పొందడం కష్టమైన పని వీటికి తోడుగా చట్ట సభలైన అసెంబ్లీ పార్లమెంటులలో బీసీ కులాల వారికి రిజర్వేషన్లు కావాలనే డిమాండ్ ను తీసుకొని ముందుకు వెళితే 60 శాతం బీసీ కులాల జనాభా గల అత్యధిక కులాల వర్గాల వారిని ఆకర్షించి జాతిపితగా అవతరించే అవకాశం అతి సమీపంలో ఉందన్నారు. జాతీయస్థాయిలో బీసీ కులాల వారు చైతన్యవంతులవుతే త్వరలో జాతీయస్థాయిలో మార్పు రాగల అవకాశాలు ముందుగా ఉన్నాయన్నారు. ఈ అవకాశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉపయోగించుకొని నాయకత్వం వహించడం అయితే బీసీ కులాల రాబోయే ఎన్నికలలో అధికారం పెట్టి ఇచ్చిన అవకాశం లభిస్తుంది అన్నారు. చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర శాసనసభలలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిన చరిత్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కలిగి ఉన్నారన్నారు. ప్రస్తుతం ఇదే సమస్యను జాతీయ స్థాయిలో ప్రచారం చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి పరిష్కార మార్గం గగనం చేయాలని బీసీ కులాల వారు కోరుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం తెలంగాణ రాష్ట్ర నాయకులు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బీసీ సంఘ పోరాట సమితి నాయకులు కే ఏ నరసింహులు, కాసెట్టి లక్ష్మణ్, కొంతం శంకరయ్య, అల్లం లచ్చన్న, అల్లం సాంబయ్య, శ్రావణ్ ప్రవీణ్ అనుముల శీను ఆకుల నరేష్ వెంబడి సత్యం ఆడేపు లక్ష్మీనారాయణ, శ్రీరాముల గంగాధర్, మామిడి విజయ్, అయిలవేణి నరసయ్య, దండవేణి చంద్రమౌళి, సిరవేణి పెద్దిరాజం, మూల భాస్కర్ గౌడ్, జంగం సంతోష్, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...