ప్రభుత్వ సహాయం అందరికీ అందించాలి.
ట్రస్మా జిల్లా అధ్యక్షుడు రాపోలు విష్ణువర్థన్ రావు.
మంచిర్యల జిల్లా ప్రతినిధి, ఏప్రిల్28, ప్రజాపాలన : ప్రైవేటు విద్యాసంస్థలు లో పనిచేస్తున్న బోధన ,బోదనేతర సిబ్బందికి కరోనా కష్టాల నుంచి ఆర్థికంగా ఆదుకునెందుకు రాష్ట్ర ప్రభుత్వం అందించే సహాయం నుప్రైవేట్ పాఠశాలలలో పనిచేసే సిబ్బంది అందరికీ అందేలా చూడాలని ట్రస్మా జిల్లా అధ్యక్షులు రాపోలు విష్ణువర్ధన్ రావు పేర్కొన్నారు. బుధవారం ప్రభుత్వం ప్రకటించిన ఆపాత్కాల భృతి 2000/- రూపాయలు మరియు 25కిలోల సన్న బియ్యం సహాయం ప్రైవేట్ పాఠశాలలలో పనిచేసే సిబ్బంది అందరికీ అందేలా చూడాలని ట్రస్మా జిల్లా సంఘం ఆధ్వర్యంలో జిల్లా పాలనాధికారి కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సురేష్కు, జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.వెంకటేశ్వర్లు గార్లకు క వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో కేవలం 2108 మంది సిబ్బందిని లబ్ధిదారులుగా గుర్తించి వారికి ఈ పథకం అమలు చేశారని అన్నారు. ఇందులో సుమారుగా 350 మంది రేషన్ షాప్ నెంబర్ లు సరిగా లేకపోవడం, 200 మంది బ్యాంక్ అకౌంట్ యొక్క ఐఎప్ ఎస్ సి కోడ్ తప్పుగా ఉండడం వల్ల వారికి ప్రభుత్వ సహాయం అందలేదని పేర్కొన్నారు. జిల్లాలో సుమారుగా 5 వేల మంది బోధన, బోధనేతర సిబ్బంది ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్నారని కేవలం 2108 మందికి మాత్రమే లబ్ధి చేకూరిందని, మిగతా 2900 మందికి కూడా లబ్ధి చేకూరే విధంగా అధికారులు చొరవ తీసుకోవాలని కోరారు. అదేవిధంగా గత సంవత్సర కాలంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నామని, గతంలో జిల్లాలో సుమారు 1,300 మంది డ్రైవర్లు, క్లీనర్లు, ఆయమ్మలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశామని, మౌన దీక్ష చేశానని, ర్యాలీలు ధర్నాలు చేసి ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలో పనిచేసే సిబ్బందికి ఆర్థిక సహాయం చేసేలా ట్రస్మా జిల్లా సంఘం కృషి చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా ప్రధాన కార్యదర్శి ఏనుగు శ్రీకాంత్ రెడ్డి, జిల్లా కోశాధికారి సురభి శరత్ కుమార్, జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ గోపతి సత్తయ్య, పట్టణ అధ్యక్షులు ఉస్మాన్ పాషా తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...