పేద రైతుల భూములను ఆక్రమించిన రియాల్టర్
శంకరపట్నం డిసెంబర్ 27 ప్రజాపాలన రిపోర్టర్:
శంకరపట్నం మండలం కాచాపూర్ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 227 లో గత 60 సంవత్సరాల నుండి పట్టా పాస్ పుస్తకం, పహాణి, రైతుబంధు సైతం అందుకుంటున్న ఊకంటి సదానందచారికి చెందిన నాలుగు ఎకరాల భూమిలో పరంధామయ్య అనే రియాల్టర్ పోలీసు,రెవెన్యూ అధికారుల అండదండలతో అక్రమంగా ప్రవేశించి బాధిత రైతులను బెదిరించి ఫెన్సింగ్, కనీలు పాతారని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి అన్నారు.
మంగళవారము సిపిఎం జిల్లా నాయకత్వం ఆధ్వర్యంలో బాధిత రైతులను పరామర్శించి, ఆక్రమణకు గురైన భూమిని సందర్శించి ఈ సందర్భంగా వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ..గతంలో ఈ భూమిపైన వివాదాలు ఉండగా ఊకంటి సదానంద చారి కోర్టులో కేసు వేశారని కేసు విచారణలో ఉండగా కేశపట్నం ఎఎస్సై తన పోలీస్ సిబ్బందితో రైతులను బెదిరించి, కోర్టు తీర్పు పరంధాములకు అనుకూలంగా వచ్చిందని అబద్ధాలు చెబుతూ భూమిచుట్టూ ఫెన్సింగ్ వేయించారని అన్నారు. అడ్డుకోబోతున్న రైతులను బెదిరించి,కేసులు పెట్టి లోపల వేస్తామని భయభ్రాంతులకు గురి చేశారని బాధిత రైతులు సిపిఎం బృందానికి తెలిపారు.
గతంలో రెవెన్యూ అధికారులకు,డిఐ కి దరఖాస్తు చేసుకోగా రెవెన్యూ అధికారులు లంచాలకు అమ్ముడుపోయి మూడుసార్లు వచ్చి ఒక్కోసారి ఒక దిక్కున హద్దులు పాతారని అన్నారు.
ఐఏఎస్ అధికారి సర్టిఫైడ్ చేసిన కాపీలు ఉండగా,అవి చెల్లవని,రెవెన్యూ అధికారులు వారికి నచ్చినట్టు హద్దులు పాతారని బాదిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
కోర్టులో కేసు నడుస్తుండగా సివిల్ సమస్యల్లో పోలీసులు దగ్గరుండి ఫెన్సింగ్ వేయించడం వెనక ఆంతర్యం ఏoటని వాసుదేవ రెడ్డి ప్రశ్నించారు.
కలెక్టర్ ఇచ్చిన సర్టిఫైడ్ కాపీయే చెల్లకుంటే, ఏ నక్ష ప్రకారం హద్దులు వేశారని అయన అన్నారు. 6 దశబ్దాలుగా కబ్జాలో ఉన్న రైతులను కాదని రెండు సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన పరంధాములకు రెవెన్యూ అధికారులు, పోలీసులు ఏ విధంగా వత్తాసు పలుకుతారని ప్రశ్నించారు.బాధిత రైతులకు భూమి దక్కేవరకు సిపిఎం ఆధ్వర్యంలో ఎంతవరకైనా పోరాడుతామని పై అధికారుల దృష్టికి,కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి బాధితుల పక్షాన నిలుస్తామని అన్నారు.భూవివాదాల్లో జోక్యం చేసుకున్న పోలీసు అధికారులపై సీపీ గారికి ఫిర్యాదు చేస్తామని, ఇప్పటికైనా ఊకంటి సదానంద చారి కి చెందవలసిన భూమిని వెంటనే అప్పగించాలని, లేదంటే పార్టీ ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సందర్శించిన వారిలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గీట్ల ముకుందరెడ్డి, గుడికందుల సత్యం,జిల్లా కమిటీ సభ్యులు యు. శ్రీనివాసు,ఎడ్ల రమేష్, జి.రాజేశం,శంకరపట్నం జోన్ కమిటీ సభ్యులు వడ్ల రాజు, యుగేందర్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...