మిర్చి రైతులకు నష్టపరిహారం చెల్లించాలి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావ
బోనకల్, డిసెంబర్ 19 ప్రజా పాలన ప్రతినిధి: మండలంలోని మిర్చి పంట దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల పరిధిలోనే గార్లపాడు గ్రామంలో తాతా లక్ష్మీనారాయణ కు చెందిన మిర్చి పంట దెబ్బతిన్న కారణంగా తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో దెబ్బతిన్న పంటలకు ఆ ప్రభుత్వం ఇన్సూరెన్స్ చెల్లించి రైతులను ఆదుకుంటుందని, కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం రైతులకు ఇన్సూరెన్స్ చెల్లించడం లేదని, దీని వలన రైతుల తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు సంవత్సరాలుగా జిల్లా వ్యాప్తంగా నల్లనల్లి, బొప్పరాగంతో మిర్చి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. కానీ ప్రభుత్వ మాత్రం రైతులను ఆదుకునే ఏ రకమైన చర్యలు తీసుకోవడం లేదని ఆయన అన్నారు. ఒక్కొక్క ఎకరానికి రైతులు లక్ష నుంచి లక్షన్నర వరకు పెట్టుబడి పెట్టారని, కానీ అందులో 20 శాతం కూడా పెట్టుబడి వచ్చే పరిస్థితి కూడా లేదన్నారు. దీనివలన అప్పుచేసి పెట్టుబడి పెట్టిన రైతులు తీవ్రంగా నష్టపోయి అప్పులు పాలవుతున్నారని, అప్పులు పాలైన అన్నదాతలు అప్పులు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు తమ ప్రభుత్వం రైతుబంధు చెల్లించి రైతులను లక్షాధికారులు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటుండగా మరోవైపు రైతులు వ్యవసాయం చేయలేక అప్పులు పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరానికి మిర్చికి లక్ష నుంచి లక్షన్నర పెట్టుబడి అవుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తే రైతులు పెట్టిన మిగిలిన పెట్టుబడి పరిస్థితి ఏమిటని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పదివేల రూపాయల వల్ల రైతులకు జరిగిన ఉపయోగం ఏమీ లేదన్నారు. ఇక కౌలు రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందన్నారు. కౌలు 20 నుంచి 25 వేల రూపాయల వరకు చెల్లిస్తున్నారని, గతంలో రైతులకు ఇన్సూరెన్స్ చెల్లించేవారని కానీ ప్రస్తుత ప్రభుత్వం ఇన్సూరెన్స్ ఎందుకు ఎత్తివేసిందో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోకపోతే తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా రైతులను సమీకరించి ఆందోళన నిర్వహిస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం మండల అధ్యక్షుడు కొమ్మినేని నాగేశ్వరరావు ,రైతులు దొండపాటి నాగేశ్వరరావు, గుడిపూడి వెంకటేశ్వర్లు, గండు సైదులు, తాత వీరయ్య, ముక్కపాటి నాగేశ్వరరావు, తాత వెంకయ్య, తాతా గోపయ్య, కిలారి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...