మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచి పర్మినెంట్ చేయాలి * *డి.కిషన్ యూనియన్ జిల్లా ప్రధాన
*మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, దళిత బంధు, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు లాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలలో వీరికి ప్రథమ ప్రాధాన్యత నుంచి అమలు చేయాలని, ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నట్లుగా వేతనాలు రూ.21,000/- లు పెంచాలని మరియు కార్మికుల ఈఎస్ఐ, ఇపీఎఫ్ లలో జరుగుతున్న అవకతవకలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఈరోజు తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఆ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి కిషన్ ఆధ్వర్యంలో తుర్కయంజాల్ మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించి మున్సిపల్ మేనేజర్ బి శ్రీనివాసులు గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది,
ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి కిషన్ మాట్లాడుతూ* మున్సిపల్ కార్మికుల్లో అత్యధికులు దళిత గిరిజన బలహీన వర్గాలకు చెందిన నిరుపేదలు మాత్రమే ఈ పారిశుద్ధ్య పనులను నిర్వహిస్తున్నారని, సమాజంలోని ఇతర కులాలు వర్గాల వారు అసహ్యించుకొని దూరంగా ఉన్న నేపథ్యంలో దళితులైన మున్సిపల్ కార్మికులు సమాజ హితం కోరి తరతరాలుగా ఈ పనుల్లో కొనసాగుతున్నారని వారి ఆత్మ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని అన్నారు ఇలాంటి కార్మికులకు మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చి వారిని వెంటనే పర్మినెంట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళిత బంధు పథకాన్ని మున్సిపల్ కార్మికులకు మొదటి క్రమంలో అమలు చేయాలని ప్రతి కార్మికునికి డబల్ బెడ్ రూమ్ ఇల్లు లేదా ఇళ్లస్థలాలు కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమాజ శ్రేయస్సు కోసం తమ ప్రాణాలను పణంగా పెడుతూ మునిసిపల్ పనులను నిర్వహిస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది మరియు ఇతర కేటగిరీల కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికులు పని భారంతో తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారని విరామం లేకుండా పనిచేయడం వల్ల అనారోగ్యాలకు గురవుతూ జబ్బుల బారిన పడుతున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే కార్యక్రమాలను జయప్రదం చేసే సందర్భంలోనూ రోజుకు ఎనిమిది గంటలు పని చేయాల్సిన వీరు 10 నుండి 12 గంటలు పని చేయాల్సి వస్తుందని ఈ క్రమంలో పోరాడి సాధించుకున్న వారాంతపు సెలవు కూడా కనుమరుగైందని ఆవేదన వ్యక్తం చేశారు, కాబట్టి మున్సిపల్ కార్మికులకు ఎనిమిది గంటల పని దినాన్ని క్రమం తప్పకుండా ఒక్క పూటలోనే అమలు చేయాలని, రక్షణ పరికరాలు రెగ్యులర్గా అందజేయాలని, ఆదివారంతో పాటు జాతీయ మరియు రాష్ట్ర పండుగల సందర్భంగా వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు,
ఈ కార్యక్రమంలో తుర్కయంజాల్ మున్సిపల్ యూనియన్ అధ్యక్షులు మేతరి దాసు, నాయకులు నవీన్ రవి పెంటయ్య జంగయ్య చంద్రయ్య మల్లయ్య యాదయ్య కుమార్ కృష్ణ రాజు శ్రీరాములు మహేష్ జ్యోతి లక్ష్మమ్మ కమలమ్మ భాగ్యమ్మ జంగమ్మ అండాలు అరుణ దీపిక మంజుల పొన్నమ్మ తదితరులు పాల్గొన్నారు,
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...