రాహుల్ జూడో పాదయాత్రకు ఒక సైన్యంపాదయాత్రకు కార్యకర్తలు తరలింపులో మల్లు నందిని కృషి అమోఘంనం
01(ప్రజాపాలన ప్రతినిధి) మధిర నియోజకవర్గం లోని కాంగ్రెస్ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తూ మరోవైపు జిల్లా కాంగ్రెస్ నాయకులను సమన్వయం చేసుకుంటూ, హైదరాబాదులో సోమవారం రాహుల్ గాంధీ నిర్వహించిన జోడో పాదయాత్రకు ఖమ్మం జిల్లా నుండి భారీ స్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలు తరలి వెళ్ళటంలో తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సతీమణి జిల్లా కాంగ్రెస్ నాయకురాలు అమ్మ ఫౌండేషన్ చైర్మన్, సామాజిక సేవకులు మల్లు నందిని పాత్ర అమోఘం అంటూ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు కొనియాడారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం మల్లు నందిని 20 సంవత్సరాలుగా ఎంతో కృషి చేస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తల కష్టసుఖాల్లో అండగా ఉంటున్నారు. మధిర ఎమ్మెల్యే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నేతగా మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర రాజకీయాల్లో, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తూ నిరంతరం బిజీగా ఉంటున్నారు. ఈ తరుణంలో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలకు మల్లు నందిని అండగా ఉంటూ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ దిశ నిర్దేశం చేస్తున్నారు. అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక ఉద్యమాలపై కార్యకర్తలతో కలిసి ఆమె ఉద్యమాల్లో పాల్గొన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ హోదాలో భట్టి విక్రమార్క రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు. ఆ సమయంలో మధిర ఎమ్మెల్యేగా పోటీ చేసిన మల్లు భట్టి విక్రమార్క గెలుపు బాధ్యతను మల్లు నందిని సవాలుగా తీసుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. హైదరాబాదులో జరిగే రాహుల్ జోడో పాదయాత్రకు ఖమ్మం పార్లమెంట్ పరిధిలో నుండి భారీ జన సమీకరణ చేయాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచించింది. భట్టి విక్రమార్క రాహుల్ పాదయాత్రలో బిజీగా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో మల్లు నందని జన సమీకరణ బాధ్యతలను తీసుకున్నారు. రేయంబగళ్ళు మల్లు నందని జిల్లా అంతా పర్యటించి రాహుల్ జూడో పాదయాత్ర విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ శ్రేణులకు పిలుపు నిచ్చింది. అంతేకాకుండా పాదయాత్రకు వెళ్లే వారందరికీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి భోజన సదుపాయాలు కల్పించారు. మల్లు నందిని కృషితో జిల్లా నలుమూలల నుండి కాంగ్రెస్ కార్యకర్తలు హైదరాబాదు తరలి వెళ్లి రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొన్నారు. అంతేకాకుండా రాహుల్ గాంధీతో కలసి కొద్దీ దూరం పాదయాత్ర చేసే అవకాశం మల్లు నందినికి లభించింది. దీంతో మల్లు నందిని ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు, జోడో పాదయాత్ర విజయవంతం కోసం చేసిన ప్రచార కార్యక్రమాలు ఖమ్మం జిల్లాలో భట్టి విక్రమార్క ప్రజా సమస్యలపై చేపట్టిన పాదయాత్ర గురించి రాహుల్ గాంధీకి మల్లు నందిని వివరించారు. మల్లు నందిని జూడో పాదయాత్ర విజయవంతం కోసం చేసిన కృషిని రాహుల్ గాంధీ అభినందిస్తూ కీప్ టప్ అంటూ మల్లు నందినిపై ప్రశంసల జల్లు కురిపించారు. మల్లు నందిని స్ఫూర్తిగా తీసుకొని కాంగ్రెస్ నాయకులు పనిచేసి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కార్యకర్తలు కోరుతున్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...