25 వేల కోట్లకు మునుగోడు ప్రజల నమ్మకాన్ని రాజగోపాల్ రెడ్డి అమ్ముకున్నారు -- పాల్వాయి స్రవంత
చౌటుప్పల్, సెప్టెంబర్ 27 (ప్రజాపాలన ప్రతినిధి): కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తే 97 వేల ఓట్లతో గెలిపిస్తే 25 కోట్ల రూపాయలకు మునుగోడు ప్రజల నమ్మకాన్ని అమ్ముకున్నారని మునుగోడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి అన్నారు. మంగళవారం చౌటుప్పల్ మండలం జై కేసారం గ్రామంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం ప్రారంభించి గ్రామంలో ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. అనంతరం ఇటీవల కాలంలో గ్రామంలో మరణించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సాల్వాది యాదయ్య కుటుంబానికి 40, వేల రూపాయలు, గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న పోలోజు విశ్వనాథ్ చారి కి 10 వేల రూపాయలు, అస్సోనిగూడెం లో అనారోగ్యంతో బాధపడుతున్న ఆకిటి అరుణ కు 20వేల రూపాయల, ఆర్థిక సహాయాన్ని పాల్వాయి స్రవంతి అందజేశారు. ఈ సందర్భంగా పాల్వాయి స్రవంతి మాట్లాడుతూ తన నాన్నగారు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఎప్పుడు ప్రచారం మొదలుపెట్టిన జై కేసారం గ్రామం నుండి మొదలుపెట్టేవారని. నేను కూడా జై కేసారం గ్రామం నుండి ప్రచారం మొదలుపెట్టానని అన్నారు. మునుగోడు ఆడపడుచు గా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న నాకు మహిళలు బ్రహ్మరథం పలుకుతున్నారన్నారు. మునుగోడు ప్రజలను, కాంగ్రెస్ పార్టీని, మోసం చేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపి పార్టీలో చేరి మళ్ళీ మునుగోడు ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ప్రజలు ఒక్కసారి ఆలోచించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బుద్ధి చెప్పాలన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం గ్యాస్, డీజిల్, పెట్రోల్, వంటనూనె, రేట్లు పెంచడమే కాకుండా పసిపిల్లలకు తాపించే పాల ప్యాకెట్లకు కూడా జీఎస్టీ వేశారని మండిపడ్డారు. నరేంద్ర మోడీ పరిపాలనలో భారతదేశంలో పేద ప్రజలు బ్రతకలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్, బిజెపి, పార్టీలు ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి ధన బలం లేకున్నా కానీ ప్రజాబలం ఉందన్నారు. ప్రజా బలం ముందు ధన బలం తలవంచక తప్పదన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని కాంగ్రెస్ పార్టీ హాయామంలోనే గ్రామాలలో సిసి రోడ్లు డ్రైనేజీలు ఏర్పడ్డాయన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేది కేవలం కాంగ్రెస్ పార్టీ అన్నారు. అందరికీ అవకాశం ఇచ్చిన మునుగోడు ప్రజలు ఒక్కసారి మునుగోడు ఆడపడుచు గా నాకు అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముప్పిడి సైదులు గౌడ్, డిసిసి కార్యదర్శులు ఆకుల ఇంద్రసేనారెడ్డి, సుర్వి నరసింహ గౌడ్, గ్రామ ఉపసర్పంచ్ యమునా యాదగిరి, గ్రామ శాఖ అధ్యక్షులు పొట్ట సత్యనారాయణ, నాయకులు మాధగోని శేఖర్ గౌడ్, తాటి రవి, మైలారం సైదులు, బండమీది సైదులు, గంగాదేవి మల్లేష్, తాటి అమర్, గంగాదేవి జ్యోతి, తాటి సంధ్య, అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...