చెట్లను నరికి ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తున్న విద్యుత్ అధికారులు విద్యుత్ అంతరాయం పేరుతో
బోనకల్, సెప్టెంబర్ 14 ప్రజా పాలన ప్రతినిధి: ప్రకృతిని పచ్చగా ఉండాలనుకోవడం ప్రభుత్వ లక్ష్యం అయితే వృక్షాలను మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి అనడం ప్రజల లక్ష్యం, మొక్కలు నాటి పెంచి పర్యావరణాన్ని సంరక్షించండి అంటున్న ప్రభుత్వ లక్ష్యం విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వలన బుగ్గి పాలవుతోంది. విద్యుత్,ఆర్ అండ్ బీ అధికారుల సమన్వయ లోపం కారణంగా వేలాది చెట్లు మధ్యలోనే మోడుగా మారుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలు,పట్టణాల్లో,రోడ్ల వెంట పచ్చని చెట్లను పెంచి పర్యావరణాన్ని రక్షించాలని హరితహారంలో భాగంగా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటే, దీనికి భిన్నంగా విద్యుత్ కు అంతరాయం ఏర్పడుతోందని నాటిన చెట్లను విద్యుత్ శాఖ అధికారులు ఎవరి అనుమతి లేకుండా నరికివేస్తున్నారు. ఎన్ని చెట్లను నరికిన విద్యుత్ అంతరాయం మాత్రం ప్రజలకు శాపంగా మారింది. విద్యుత్ సమస్యల పేరు మీద వృక్షాలను నరుకుతున్నారే తప్ప విద్యుత్ సమస్య మాత్రం తీరడం లేదు. ఈ సంఘటన బోనకల్ మండల పరిధిలో రావినూతల గ్రామంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల పచ్చని చెట్లు నేలకొరిగాయి. చెట్లను నరకడమే కాకుండా నరికిన చెట్లను రహదారులకు అడ్డదిడ్డంగా పడేస్తున్నారు. నరికిన చెట్లు ఎవరు తీస్తారు అని అడగగా విద్యుత్ అధికారులు మాత్రం సమాధానం చెప్పటం లేదు. నరికిన చెట్లు సర్వీస్ వైర్ల మీద పడి ఇంటి మొత్తానికి షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఏర్పడింది. ఈ సంఘటన రావినూతల గ్రామంలో చోటుచేసుకుంది. అదేవిధంగా రావినూతల గ్రామంలో పేదలకు అధిక విద్యుత్ బిల్లులు వస్తున్నాయి అని పేదలు విద్యుత్ అధికారులను అడగగా మీరు వెళ్లి కేసీఆర్ ని అడగండి అని అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొక్కలు నాటండి, పర్యావరణాన్ని సంరక్షించండి అంటుంటే విద్యుత్ అధికారులు మాత్రం పెంచిన చెట్లను ఎవరి అనుమతి లేకుండా కరెంటు వైర్లకు అడ్డుగా వస్తున్నాయి అని నరికి వేస్తున్నారు. చెట్లను నరికివేయడం చట్ట వ్యతిరేకమైన చర్యగా భావించాలి. విద్యుత్ తీగల కింద నాటిన మొక్కలు ఎదిగిన కొన్నాళ్లకే విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల నరికివేతకు గురవుతున్నాయి. ప్రభుత్వ లక్షసాధనలో విద్యుత్ తీగల కింద మొక్కలు ప్రతి ఏటా హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన భాధ్యతను అధికారులకు, ప్రజాప్రతినిధులకు అప్పగించారు. దీంతో ఎలాగైనా లక్ష్యం మేరకు మొక్కలు నాటాలనే తాపత్రయంలో ఏమాత్రం ముందు చూపు లేకుండానే ఏకంగా విద్యుత్ వైర్లకిందే మొక్కలు నాటేస్తున్నారు. నాటిన మొక్కలు ఏడాదిలోపు విద్యుత్ వైర్లను తాకుతున్నాయి. దీంతో విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడుతుందని విద్యుత్ అధికారులు అంటున్నారు. ఇకనైనా ఉన్నత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...