ఘనంగా వెలుగుగుట్ట దేవాలయంలో చండీ హోమం
మేడిపల్లి, అక్టోబర్11 (ప్రజాపాలన ప్రతినిధి) : శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వెలుగుగుట్ట శ్రీ మల్లిఖార్జున స్వామి దేవాలయంలో 5వ రోజు శ్రీదుర్గా పరమేశ్వరి అమ్మవారు కాశీ అన్నపూర్ణేశ్వరీగా సమస్తలోకాలకు అన్నపానీయాలు లోటులేకుండా అనుగ్రహించే అన్నపూర్ణ అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. సోమవారం ఉదయం పంచామృత అభిషేకములు, దుర్గా సూక్తం, శ్రీ సూక్తం, విధానంతో అభిషేకము, అలాగే అలంకారము, సుహాసినులచే కుంకుమార్చన విశేషంగా నక్షత్ర హారతులు మంత్రపుష్పము తీర్థ ప్రసాద వితరణ జరిగింది. తదనంతరం చండీ హోమం నిర్వహించారు. మహా మంగళ హారతి తీర్థప్రసాద వితరణ అత్యంత భక్తి ప్రపత్తులతో విశేషమైన భక్తజనులతో వైభవంగా జరిగినది. అన్నప్రసాద వితరణ దాతలుచే నిర్వహించబడినది.
Share this on your social network:
Related News
వలిగొండ ప్రజాపాలన మండలంలోని వెంకటాపురం గ్రామ పర...
జన్నారం మార్చి 4 ప్రజా పాలన:
బాలాపూర్: (ప్రతినిధి) ప్రజాపాలన న్యూస్; మహా శివర...
వెల్గటూర్, మార్చి 24 (ప్రజాపాలన ప్రతినిధి) : వెల్గట...
వెల్గటూర్, మార్చి 28, (ప్రజాపాలన ప్రతినిధి) : వెల్గటూర్ మ...
వలిగొండ, మార్చి 29, ప్రజాపాలన ప్రతినిధి : మండల పరి...
మధిర, ఏప్రిల్ 21, ప్రజాపాలన ప్రతినిధి : మధిర రామాలయం శ్రీరామనవమిని పురస్కరిం...
బాలపూర్, ఏప్రిల్ 21,
గుమ్మడిదల, ఏప్రిల్ 25, ప్రజాపాలన ప్రతినిధి : వికారాబాద్ బ్యూరో 06 సెప్టెంబర్ ప్రజాపాలన : శ్రావణ మాసం చివరి ...
యాదాద్రి భువనగిరి జిల్లా, సెప్టెంబర్ 15, ప్రజాపాలన ప్రతినిధి : మండల పరిధిలోన...