హనుమాన్ ఆలయంలో కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి దంపతులు ప్రత్యక పూజలు

Published: Tuesday March 09, 2021
మేడిపల్లి, మార్చి 8(ప్రజాపాలన ప్రతినిధి) : ఉప్పల్ డివిజన్ సత్యనగర్లోని హనుమాన్ ఆలయంలో స్ధానిక కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వార్షికోత్సవం సందర్భంగా కార్పొరేటర్ దంపతులు ఆలయాన్ని సందర్శించి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు బాకారం లక్ష్మణ్, ఆలయ అర్చకులు వెంకటేశ్వర్ శర్మ,అశోక్ గుప్తా, సత్య నగర్ కాలనీ అధ్యక్షులు విజయ్ గుప్తా, కుశంగల సతీష్ ముదిరాజ్, మంద మురళీ కృష్ణ రెడ్డి, సల్ల ప్రభాకర్ రెడ్డి, సత్తి, గొరిగే నాగేష్, రాజు, జనగాం రామకృష్ణ, ఏలుగుల అనీల్ కుమార్, అల్వాల భాస్కర్, లింగంపల్లి రామక్రిష్ణ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.