దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు

Published: Friday October 08, 2021
బాలాపూర్: అక్టోబర్ 07, ప్రజాపాలన (ప్రతినిధి) : దేవీ శరన్నవరాత్రి  ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకోవాలని కార్పోరేషన్ మేయర్ పేర్కొన్నారు. గురువారం అమ్మలగన్న అమ్మ వారి పలు మండపాలు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ..... దుర్గమ్మ అమ్మలగన్న అమ్మవారి కృపాకటాక్షాలు మన అందరి పైన ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. అమ్మవారి ఉత్సాహాలు అంగరంగ వైభవంగా జరుపుకోవాలని, అలాగే ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అదేవిధంగా బాలాపూర్ గ్రామంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాధితులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అటుకుల బతుకమ్మ అందరిని ఆదుకోవాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఇబ్రమ్ శేఖర్, కార్పొరేషన్ కార్పొరేటర్లు వంగేటి ప్రభాకర్ రెడ్డి, బండారి మనోహర్, కో ఆప్షన్ సభ్యులు రఘునందున చారి, నాయకులు ఎర్ర జైహింద్, తదితరులు పాల్గొన్నారు.