సీతారాముల కళ్యాణం లో పాల్గొన్న ఇంటూరి దంపతులు

Published: Thursday April 22, 2021
పాలేరు, ఏప్రిల్ 21, (ప్రజాపాలన ప్రతినిధి) : ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్ళచేరువు గ్రామంలో గల శ్రీ సీతరామచంద్ర స్వామి దేవస్థానం నందు రాముని కళ్యాణము కనుల పండుగ గా జరిగింది. ఈ కార్యక్రమముకు ముఖ్య అతిథులుగా ఖమ్మం డిసిసిబి డైరెక్టర్. ఇంటూరి శేఖర్, వారి సతీమణి జెడ్ పి టి సి సభ్యులు బేబీ శేకర్. పాల్గొని కల్యాణం జరిపించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థాన. చైర్మన్ బొడ్డు నరేందర్, శ్రీ సీత రామచంద్ర స్వామి దేవస్థాన చైర్మన్ చెన్న వెంకన్న, రామాలయం పాలకమండలి సభ్యులు కొండం నాగయ్య, గోగులా అంజయ్య, చింతలపాటి రామకృష్ణ, నాగమణి, నాగేశ్వరరావు, అర్చకులు శ్రీమన్నారాయణ చార్యులు, సీత రామాంజ చర్యలు, సర్పంచ్ కొండ సత్యం ఎంపీటీసీ ఉమ శ్రీనివాస్, ఉప సర్పంచ్ గోపి హరినాద్, గ్రామ పెద్దలు ఐ తగని చిన్న నరసింహ రావు, గోపగని ముత్తయ్య, బాలేబొయిన రమేష్, మల్లెల రవి కొండ వెంకన్న, కుమ్మరికుంట్ల వీరబాబు, గుద్దటి బిసు మరియు భక్తులు కోవిడ్ నిబంధనలను అనుసరించి పాల్గొన్నారు.