సర్పంచ్ జంగా పుల్లారెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారికి కుంకుమ పూజ

Published: Friday October 08, 2021
ఎర్రుపాలెం, అక్టోబర్ 7, ప్రజాపాలన ప్రతినిధి: మండల కేంద్రంలోని బనిగండ్లపాడు గ్రామంలో దసరా పండుగ సందర్భంగా సర్పంచ్ జంగా పుల్లారెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారికి కుంకుమ పూజ చేయటం జరిగింది. జంగా గుర్నాథరెడ్డి అమ్మవారి విగ్రహాన్ని దాత గా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జంగా పుల్లారెడ్డి మాట్లాడుతూ అమ్మవారి విగ్రహాన్ని దాతగా ఇచ్చినటువంటి గురునాథ రెడ్డిని అభినందించారు. అనంతరం దసరా పండుగ గురించి ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జంగా పుల్లారెడ్డి, మండల మహిళా అధ్యక్షురాలు శీలం ఉమా మహేశ్వరి, వార్డ్ నెంబర్ లక్ష్మి, మహిళలు గ్రామప్రజలు, యూత్ తదితరులు పాల్గొన్నారు