సీతారాములోరి కల్యాణం కమణీయం రమణీయం నయనందకరం
Published: Thursday April 22, 2021
గొల్లపల్లి, ఏప్రిల్ 21, (ప్రజాపాలన ప్రతినిధి) : అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుకుడు ఆదర్శ పాలకుడు మర్యాద పురుషోత్తముడు పితృవాఖ్య పరిపాలకుడు ధర్మ రక్షకుడు మాత మాహాసాద్వి శ్రీ శీతరామ సమేత కల్యాణ మహోత్సవం ప్రభుత్వ కోవిడ్19 నిబంధనలుపాటిస్తూ ఆలయకమిటీ ఛైర్మన్ ఆనంతుల భూమయ్య సువర్ణ కమిటీ సభ్యుల సారధ్య సేవలతో పరిమిత భక్తుల తో స్వామీ దేవేరుల నిత్య కైంకర్యాలు మరియు విశేష పూజలతో సంప్రదాయ సహితంగా మండలకేంద్రంలో శ్రీ శీత రామచంద్రస్వామి ఆలయంలో మరియు గ్రామాల్లోని ఆలయాలు అంగరంగ వైభవ సర్వాంగ సుందరంగా ముస్తాబై కళ్యాణకళ వసంత శోభను సంతరించుకుంది. ఆలయఅర్చకులు సత్యనారాయణచార్య సారధ్యంలో నిరాడంబరంగా వేదపండితులు స్వామీ వారి కళ్యాణం నిర్వహించారు. వివాహవిశిష్టత ను పండిత పామరులకు కళ్ళకు కట్టి నట్టినట్లు పండితుల వాఖ్యానంతో టీవీ ప్రసారాల ద్వారా భక్తులు భక్తి పారవశ్యంతో ఓలలాడినారు. అనంతరం ఆలయంలో ఆచారసహిత ప్రకారం తీర్థప్రసాదాలు వితరణచేశారు.కళ్యాణ మహోత్సవానికి ఎంపీపీ నక్కశంకర్ వైస్ ఎంపీపీ సత్యం జడ్పీటీసీ జలందర్ ఏఎమ్ సీ ఛైర్మెన్ లింగారెడ్డి ప్యాక్స్ ఛైర్మన్ లు రాజా సుమన్ రావు జీవి మాధవరావు సర్పంచ్ నిశాంత్ రెడ్డి ఉప సర్పంచ్ రాజశేఖర్ తెరాస మండల పట్టణ అధ్యక్షుడు బొల్లం రమేష్ చౌటపల్లి తిరుపతి భక్తులు తదితరులు సేవలో పాల్గొన్నారు.
Share this on your social network: