మహిమాన్విత క్షేత్రం మత్స్యాద్రి

Published: Tuesday November 16, 2021
యాదాద్రి నవంబర్ 15 వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో గల శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి వెలసిన దివ్యక్షేత్రంగా మత్స్యాద్రి భక్తాదులకు కృపాకటాక్షాలు అందిస్తూ వెలసిల్లుతుందని మాజీ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనందభాస్కర్ అన్నారు. బ్రహ్మోత్సవాలల్లో భాగంగా సోమవారం స్వామివారి దర్శనార్థం క్షేత్ర పర్యటనకు విచ్చేసిన ఆయనకు ఆలయ ఈవో రవికుమార్ మరియు ప్రధానార్చకులు యాదగిరిస్వామి స్వాగతం పలికి స్వామివారి దర్శనంతోపాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు స్వామివారి శేషవస్త్రాలతో సత్కరించి ఆశీర్వచనం చేసారు. కార్యక్రమంలో రాపోలు రాజశేఖర్, విష్ణు, ప్రవీణ్, గ్రామ పద్మశాలి సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.