ఓం నమః శివాయ నమః

Published: Monday September 06, 2021
మధిర, సెప్టెంబర్ 05, ప్రజాపాలన ప్రతినిధి : ఆదివారం ఉదయం మాస శివరాత్రి సందర్భంగా స్వామివారికి అభిషేకాలు నిర్వహించబడ్డాయి. మరియు ఉదయం 10 గంటలకు స్వామి వారికి శ్రీ చీకటి నాగేశ్వరరావు మరియు ధర్మపత్ని లలిత కుమారి గార్ల చే "శాంతి కళ్యాణం" జరుపబడింది ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శ్రీ వంకాయలపాటి నాగేశ్వరరావు గారు, ధర్మకర్తల మండలి సభ్యులు, దేవస్థానం కార్యనిర్వహణాధికారి మరియు ఆలయ అర్చకులు శ్రీ రాయప్రోలు సత్యనారాయణ శర్మ ఆలయ సిబ్బంది పాల్గొనడం జరిగింది పబ్బతి రమేష్, శ్రీ మృత్యుంజయ స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు, మధిర