అమ్మవారి బోనాల సందడి

Published: Tuesday October 12, 2021
మల్లాపూర్, అక్టోబర్ 11 (ప్రజాపాలన ప్రతినిధి) : మల్లాపూర్ మండల కేంద్రంలో శ్రీ కనక దుర్గమ్మ దేవి ఆలయంలో శ్రీ దేవిశరన్నవరాత్రి ఉత్సవాల భాగంగా సోమవారం మల్లాపూర్ నవదుర్గా సేవాసమితి ఆధ్వర్యంలో బోనాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలను తలపై పెట్టుకొని ఊరేగింపు నిర్వహించి అనంతరం అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి బోనాలు సమర్పించారు. అమ్మవారు శ్రీ స్కంద మాత అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో తోట రవీందర్, నాంపల్లి మారుతి, కైరా రాములు, లక్ష్మారెడ్డి, రాజ్ కుమార్, మ్యాకాల సతీష్, వంజరి సురేందర్, దుర్గ భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.