నాగలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు

Published: Friday February 26, 2021
జగిత్యాల, ఫిబ్రవరి 25 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ మండల్ శ్రీ రాజరాజేశ్వర స్వామి  నాగాలయ దేవాలయంలో నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కవితకు స్వాగతం పలికి ప్రత్యేక చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత ఎమ్మెల్యేలు డా.సంజయ్ కుమార్ సుంకే రవిశంకర్ ఎంపీపీలు లావుడ్య సంధ్యారాణి గాజర్ల గంగారాం గౌడ్ జడ్పీటీసీలు అశ్విని జాదవ్ సంగెపు మహేష్ మున్సిపల్ చైర్మెన్స్ మోర హన్మాండ్లు బోగ శ్రావణి తెరాస నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.