ఘనంగా వినాయక పూజలు

Published: Thursday September 16, 2021
మధిర, సెప్టెంబర్ 15, ప్రజాపాలన ప్రతినిధి : మధిర పట్టణంలోని ప్రకాశం రోడ్ లో శ్రీ విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ, రోషన్ బ్యాచ్ వారిచే ఏర్పాటుచేసిన గణేష్ మండపము నందు శ్రీ విగ్నేశ్వర స్వామి వారికి 6వ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రత్యేక పూజలలో శ్రీ వాసవి అమ్మవారి దేవాలయం అధ్యక్షులు శ్రీ కపిలవాయి జగన్ మోహన్ రావు, మధిర మున్సిపాలిటీ కోఆప్షన్ నెంబర్ శ్రీమతి కపిలవాయి భరణి గార్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ ఉత్సవ సభ్యులు పాల్గొన్నారు.