శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో దసరా మహోత్సవాలు

Published: Friday October 08, 2021
మధిర, అక్టోబర్ 07, ప్రజాపాలన ప్రతినిధి : మధిరలో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో శ్రీమాన్ శేషాచార్యులు ఆధ్వర్యంలో దసరా మహోత్సవాలు ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ దసరా పండుగకు ఉత్సవాలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని అమ్మవారి దీవెనలు ఎప్పుడూ ఉంటున్నాయని అదే భాగంగా మొదటి రోజున అమ్మవారుకి బాల త్రిపుర సుందరి అలంకరణ జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని అందరూ తీర్థప్రసాదాలు స్వీకరించారు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో కన్యకా పరమేశ్వరి దేవాలయం అధ్యక్షుడు కపిలవాయి జగన్మోహన్ రావు మరియు ఆలయ కమిటీ బృందం తదితరులు పాల్గొన్నారు