మంచిర్యాల వైశ్య సంఘం ఆధ్వర్యంలో గోపూజ, అయ్యప్ప పడిపూజ

Published: Monday November 29, 2021
మంచిర్యాల బ్యూరో, నవంబర్ 28, ప్రజాపాలన: మంచిర్యాల పట్టణ ఆర్యవైశ్య సంఘం, వాసవీ ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక కాలేజీ రోడ్లోని వైశ్య సంఘం స్థలంలో గోమాత పూజాకార్యక్రమంతో పాటు మహారుద్రాభిషేకం, అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. స్థానిక కాలేజీ రోడ్లో గల వైశ్య సంఘానికి చెందిన స్థలంలో రంగరంగ వైభవంగా ఉదయం గోపూజను నిర్వహించి మహారుద్రాభిషేకంతో పాటు అయ్యప్పస్వామి పడిపూజను విశ్వనాథ ఆలయ అర్చకులు సంఘనభట్ల నరహరి శర్మ నిర్వహించారు. అనంతరం కార్తికమానం కావడంతో ఉసిరిచెట్టు కింద తీర్ధప్రసాద కార్యక్రమం, అన్న ప్రసాదంను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల పట్టణ అధ్యక్షులు దొంతుల ముఖీష్, కార్యదర్శి అంచూరి నగేష్, కోశాధికారి ముస్త్యాల శ్రీనివాస్, యువజన సంఘం అధ్యక్షులు కంభంపాటి కమలాకర్, కార్యదర్శి తనుకు శ్రీనివాస్, కోశాధికారి పడకంటి ప్రవీణ్, జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ముక్తా శ్రీనివాస్, వైశ్య సంఘం నాయకులు చిలువేరు వైకుంఠం, చిలువేరు. శ్రీనివాస్, సిరిపురం రాజేష్, కొత్త రాజేశం, గంప చంద్రశేఖర్, గుండా విజయ్ కుమార్, ఎర్రం వెంకటేష్, అక్కెనపెల్లి రవీందర్, గోలి రాము, పుల్లూరి బాలమోహన్ తో పాటు మాజీ అధ్యక్షులు, వైశ్య సంఘం ప్రముఖుల, పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు.