శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కే యస్ జి యువసేన
గుమ్మడిదల, ఏప్రిల్ 25, ప్రజాపాలన ప్రతినిధి : కష్టం అంటూ తలుపు తడితే సాయం చేసే మనసున్న మారాజు నమ్ముకున్న వారిని చేరదిసే తత్వం మంచికి మారుపేరు పటాన్ చేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కాట శ్రీనివాస్ గౌడ్, కరోనా మహమ్మారి నుండి తోందరగా కోలుకోవాలని ప్రఖ్యాత ప్రసిద్ధి గాంచిన సికింద్లాపూర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో గుమ్మడిదల మండలంకే యస్ జి యువసేన ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఈ సందర్భంగా కే యస్ జి యువసేన సభ్యులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎల్లప్పుడూ నేను ఉన్న అంటూ నిత్యం ప్రజల కోసం పాటుపడే నాయకుడు కాట శ్రీనివాస్ గౌడ్ అని ఆ భగవంతుడు ఆయనకు ఆయు ఆరోగ్యాలు ప్రసాదించి తోందరగా కోలుకోవాలని శ్రీ లక్ష్మి నరసింహ స్వామీని కోరుకుంటునమన్నారు. ఈ కార్యక్రమంలో కే యస్ జి యువసేన సభ్యులు పోతరాజు సుధాకర్, ఆర్ మల్లేష్, పి శ్రీను, యన్ శీవ, సూరి, ప్రేమ్ కుమార్, జీవన్, నరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: