మధిర శివాలయం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం
Published: Tuesday March 02, 2021
మధిర, మార్చి1, ప్రజాపాలన ప్రతినిధి: మధిర శివాలయం దగ్గర ఆలయ కమిటీ నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా ఆలయ కమిటీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషదాయకం అన్నం పరబ్రహ్మ స్వరూపం అని, మహాశివరాత్రి ఉత్సవ ఏర్పాట్లులో భాగంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం పట్ల ఆ మహాశివుని కృపాకటాక్షం పొందుతారని సిబ్బందిని ఈవో సత్యనారాయణ మరియు మృత్యుంజయ స్వామి చైర్మన్ వంకాయలపాటి నాగేశ్వరరావు కమిటీ సభ్యులు ఈ సందర్భంగా అభినందించారు అనంతరం శివాలయం ఉత్సవం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, టిఆర్ఎస్ నాయకులు అరిగే శ్రీనివాసరావు, కోఆప్షన్ సభ్యులు కోటార్ రాఘవరావు, తెరాస నాయకులు పాలపోతు ప్రసాద్, బత్తుల శ్రీనివాసరావు, విగ్నేశ్వర ఆలయ ధర్మకర్తలు క్రిష్ణ నాయక్, రామకృష్ణ, ఆలయ ఈవో తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: