20 సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్న శివ వాయుపుత్ర యూత్ అసోసియేషన్

Published: Thursday September 16, 2021
కూకట్పల్లి, సెప్టెంబర్ 15, ప్రజాపాలన ప్రతినిధి : నియోజకవర్గ పరిధిలోని కేపీహెచ్బీ కాలనీ రోడ్ నెంబర్ ఫైవ్ ఎల్ ఐ జి గ్రౌండ్ నందు గత 20 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు యూత్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. కుల మత భేదాలు కు తావివ్వకుండా అందరూ కలిసికట్టుగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు గతంలో నిర్వహించిన లడ్డూ వేలం పాట లక్ష రూపాయల పై చిలుకు పలికినట్లుగా తెలిపారు నిత్యం స్థానిక కుటుంబ సభ్యులతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రసాదాలు పంపిణీ చేస్తూ తొమ్మిదవ రోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించుకొని పదో రోజు ఊరేగింపుగా గణనాధుని స్మరించుకుంటూ 11వ రోజు నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని సభ్యులు తెలిపారు ఎందరో స్థానికంగా తమని ఆదర్శంగా తీసుకొని గణేష్ ఉత్సవాలు నిర్వహించడం తమకు ఎంతో ఆనందదాయకంగా ఉందని అన్నారు. ప్రజా ప్రతినిధులు, పోలీస్ శాఖ, మున్సిపల్ శాఖ, విద్యుత్ శాఖ, వాటర్ వర్క్స్, మీడియా అందరి సహకారం మరువలేనిదని ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేశారు. కరోనా మహమ్మారి మూడవ వేవ్ రాకుండా అందరిని గణనాథుడు కాపాడతానని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో శివవాయుపుత్ర యూత్ అసోసియేషన్ శ్రీధర్ జంగల (ప్రెసిడెంట్)తేజ లింగ (వైస్ ప్రెసిడెంట్)రాజి రెడ్డి (ట్రెజరీ)గద్దె కార్తిక్ రాజు (జనరల్ సెక్రెటరీ)శివ ప్రసాద్ (ఆర్గనైజర్)ఇబ్రహీం