ఘనంగా సీతారాముల కళ్యాణోత్సవం

Published: Thursday April 22, 2021
మేడిపల్లి, ఏప్రిల్ 21 (ప్రజాపాలన ప్రతినిధి) : మేడిపల్లిలోని శ్రీశ్రీశ్రీ సీతారమచంద్ర స్వామి దేవాలయంలో ట్రస్ట్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణోత్సవానికి ముఖ్య అతిథులుగా పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, కార్పొరేటర్లు హరిశంకర్ రెడ్డి, పాశం శశిరేఖ దంపతులు, అనంత రెడ్డి పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కల్యాణాన్ని కోవిడ్ నిబంధనలు అనుసరించి నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా భవ్య రామ మందిర నిర్మాణం జరగాలని, కోవిడ్ కారోన వైరస్ నుండి తొందరగా విముక్తి కలగాలని స్వామి వారిని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో సాయిలు, పంగ అర్జున్ కమిటీ సభ్యులు బలరాజ్ గౌడ్, ఎడవెల్లి రఘువర్ధన్ రెడ్డి, జైపాల్ రెడ్డి, బ్రహ్మయ్య చౌదరీ, చంద్రయ్య గౌడ్, వెంకటేష్, వంశీకృష్ణ మల్లం వెంకటేష్, సరస్వతీ తదితరులు పాల్గొన్నారు.