శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కార్పొరేటర్
Published: Monday September 27, 2021
బోనకల్, సెప్టెంబర్ 26, ప్రజాపాలన ప్రతినిధి : మండలం పరిధిలోని చోప్పకట్లపాలెం గ్రామంలో శ్రీ మల్లినాథ మహా నాగ శివాలయంలో శనివారం ఖమ్మం 12వ డివిజన్ కార్పొరేటర్ చిరుమామిళ్ళ లక్ష్మీ నాగేశ్వరరావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పండితులు వేద మంత్రాలను కార్పొరేటర్ దంపతులకు ఆశీర్వచనాలు అందించారు. శివాలయం ప్రతిష్ట మహోత్సవం శనివారం తో 41 రోజులు కావున గ్రామంలో శివపార్వతుల కళ్యాణం, అభిషేకాలు ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి సుమారు 20 వేల విలువచేసే పెరుగు ప్యాకెట్ లను అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుబ్బారావు, వడ్డె ప్రసాద్, వడ్డె నరేష్, బోయినపల్లి వెంకటేశ్వర్లు, కిలారు సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: