మృత్యుంజయ స్వామికి ప్రత్యేక పూజలు

Published: Thursday November 18, 2021
మధిర నవంబర్ 17 ప్రజాపాలన ప్రతినిధి : మధిర శ్రీ మృత్యుంజయ స్వామి ఆలయంలో కార్తీక మాసం ప్రత్యేక అలంకరణ పూజలలో భాగంగా నేడు స్వామివారికి ప్రత్యేక అలంకరణలతో పూజలు నిర్వహించారు. నేడు నెల 18 గురువారం రోజుననే కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని నిర్వహించుకోవాలని, అని దీనిలో భాగంగా 365 వత్తులతో కార్తీక దీపాలను వెలిగించే ఈ కార్యక్రమాన్ని గురువారం సాయంత్రం నిర్వహించుకోవాలని ఆలయ అర్చకులు రాయప్రోలు వెంకట సత్యనారాయణ శర్మ పేర్కొన్నారు. అలాగే స్వామి వారికి ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు, తెల్లవారుజామున మూడు గంటల నుండి ప్రారంభమవుతాయని, భక్తులు గమనించాలని కోరారు.