చండీ యాగం లో పాల్గొన్న మేయర్

Published: Monday October 11, 2021
బాలాపూర్: అక్టోబర్ 10, ప్రజాపాలన ప్రతినిధి : కార్పొరేషన్ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని చండీ యాగంలో పాల్గొన్న కార్పొరేషన్ మేయర్. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 22వ డివిజన్ కార్పొరేటర్ పెద్ద బావి సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో చండీ యాగంలో ముఖ్యఅతిథిగా మేయర్ చిగురింత పారిజాత నరసింహరెడ్డి తో పాటు లిక్కి మమతా కృష్ణారెడ్డి, పెద్ద బావి భుజంగ రెడ్డి సతీసమేతంగా పాల్గొన్నారు. అదేవిధంగా 20వ డివిజన్ లో వైద్య సిబ్బందికి శానిటైజర్ హ్యాండ్ వాష్ కిట్లను స్థానిక కార్పొరేటర్లు కలిసి వైద్య సూపర్వైజర్ తో పాటు మేయర్ పారిజాత నరసింహారెడ్డి చేతుల మీదగాపంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద బావి శ్రీనివాస్ రెడ్డి, నాయకులు రాల్లగూడెం శ్రీనివాస్ రెడ్డి, లీక్కి కృష్ణారెడ్డి, గౌర శ్రీనివాస్, పెద్దలు తదితరులు పాల్గొన్నారు.