ఘనంగా కేతేశ్వరస్వామి కంకాలమ్మ జాతర ప్రారంభం
Published: Monday January 24, 2022
జన్నారం రూరల్ జనవరి 23 ప్రజాపాలన:- మండలంలోని పోన్కల్ గ్రామపంచాయతి పరిధిలోని వీర్ల గుట్టపై కొలువైన కేతేశ్వరస్వామి కంకాలమ్మ అమ్మవారి దేవస్థానంలో జాతర ఘనంగా ఆదివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా జాతరను పురస్కరించుకుని దేవస్థానంలో ఉన్న స్వామి అమ్మవార్లకు వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు., జన్నారం మండలంతో పాటు వివిధ మండలాలు జిల్లాల నుంచి అదిక సంఖ్యలో వచ్చిన భక్తులు దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు దర్శించుకొని పూజలు చేశారు., కోవిడ్ కావడంతో దూర దూరంగా వుంటూ మాస్కులు దరించి జాగ్రత్త పాటింంచారు., జాతర కావడంతో జన్నారం మండలం కేంద్రంతో పాటు పరిసర గ్రామాలలో పూర్తిగా అధ్యాత్మిక వాతావరణం ఏర్పడింది.
Share this on your social network: