శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రీ అభయ నాగేంద్ర స్వామి వారి 8వ వార్షికోత్సవం

Published: Wednesday October 27, 2021
మధిర అక్టోబ26 ప్రజాపాలన ప్రతినిధి వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం మధిరలో క్షేత్రపాలకుడిగా వేంచేసియున్న శ్రీ అభయ నాగేంద్ర స్వామి వారి ఎనిమిదవ వార్షికోత్సవ సందర్భంగా ఈ రోజున శ్రీ వాసవి మాత కు పంచామృతస్నపన, నిత్యార్చన మరియు శ్రీ అభయ నాగేంద్ర స్వామి వారికి పంచామృత స్నపన, సహస్రనామార్చన మంత్రపుష్పం కార్యక్రమాలు శ్రీమాన్ శేషాచార్యులు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ కమిటీ అధ్యక్షుడు కపిలవాయి జగన్ మోహన్ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వార్షికోత్సవం ఎనిమిదో ఈ సంవత్సరం భక్తులు అధికంగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని స్వామి కృపకు పాత్రులు తెలిపారు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారుకమిటీ బృందం తదితరులు పాల్గొన్నారు తదనంతరం భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు