ఘనంగా శివరాత్రి వేడుకలు

Published: Friday March 12, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని సంగెం గ్రామంలో గల శివాలయంలో మహాశివరాత్రి పురస్కరించుకొని శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. అనంతరం మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధిలోగల శ్రీ మత్స్యగిరి ఆలయ ప్రాంగణంలో గల పంచముఖ రామలింగేశ్వర ఆలయంలో, అరూర్ స్టేజి వద్ద, రెడ్లరేపాకలో, సుంకిషాలలో, స్థానిక శివాలయంలో, శ్రీ త్రిశక్తి ఆలయంలో మహాశివరాత్రి సందర్భముగా శివాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వలిగొండ పిఏసిఎస్ చైర్మన్ సురకంటి వెంకట్ రెడ్డి, సర్పంచ్ కీసర రాంరెడ్డి, మాజీ సర్పంచ్ కాసుల కృష్ణ, మత్స్యగిరి ఆలయ కార్యనిర్వహణాధికారి రవి కుమార్, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ ముద్దసాని కిరణ్ రెడ్డి, ధర్మకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.