అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం

Published: Wednesday March 31, 2021
రాయికల్,మార్చ్ 30 (ప్రజాపాలన ప్రతినిధి) : రాయికల్ మండలం  చెర్లకొండపుర్ గ్రామంలో శ్రీ లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణం ఈ రోజు రాత్రి 10 గంటలకి, డోలోత్సవం మార్చి 31,మరియు రథోత్సవం ఏప్రిల్ 1న అంగరంగవైభవంగా గ్రామ ప్రజల సహకారంతో జరుగనుంది. ఈ కార్యక్రమంలో గ్రామప్రజలు మరియు చుట్టూపక్కల గ్రామాల భక్తులు విచ్చేస్తారని  స్వామివారి ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు వస్తారని ఆలయ పూజారి దేవుని లక్ష్మినారాయణ, గ్రామా సర్పంచ్ ఆకుల లక్ష్మినారాయణ, మరియు వార్డ్ సభ్యులు తెలిపారు.