గణనాథునికి ప్రత్యేక పూజలు

Published: Friday September 17, 2021
మేడిపల్లి, సెప్టెంబర్ 16 (ప్రజాపాలన ప్రతినిధి) : గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని చిల్కానగర్ డివిజన్లోని న్యూరాంనగర్ నగర్ కాలనీ లోని శ్రీసాయి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణేష్ మండపం వద్ద డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ గణనాధుని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విబి నర్సింహ, ఎదుల కొండల్ రెడ్డి, నాగరాజ్, రాంరెడ్డి, కొకొండ జగన్, బింగి శ్రీనివాస్, శ్రీసాయి యూత్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.