ఘనంగా 25వ డివిజన్లో బతుకమ్మ సంబరాలు

Published: Friday October 08, 2021
మేడిపల్లి, అక్టోబర్ 07 (ప్రజాపాలన ప్రతినిధి) : పీర్జాదిగడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 25వ డివిజన్ కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో డివిజన్లోని మహిళామణులు ఎంగిలి పువ్వుల బతుకమ్మ పండగ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విహారిక కాలనీ,శ్రీ సాయి నగర్ కాలనీ, సాయి నగర్ హిల్స్ కాలనీ మరియు క్రాంతి కాలనీలలో నిర్వహించిన బతుకమ్మ పండగ సంబరాల్లో ముఖ్య అతిథులుగా మేయర్ జక్క వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు బోటుమంచి సునీల్, ప్రధాన కార్యదర్శి జేట్ట చంద్రశేఖర్ మరియు మహిళలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.