నవ నిర్మాణ దీక్షా లక్ష్యాలను సాధిద్దాం
విజయవాడ, జూన్ 2 : సమైక్యాంధ్రప్రదేశ్ విభజన జరిగి రెండేళ్ళు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు ఈరోజు నవ నిర్మాణ దీక్షకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల పాటు సాగే ఈ కార్యక్రమాల్లో తొలిరోజు నియోజకవర్గాల వారీగా ఉదయం 11 గంటలకు ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. అందులో భాగంగా విజయవాడ బెంజి సర్కిల్ వద్ద జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొని అక్కడకు హాజరైన ప్రజలతో, ఉద్యోగులతో, విద్యార్ధులతో ప్రతిజ్ఞ చేయించారు. '' అవినీతి, కుట్ర రాజకీయాల వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని మన కష్టంతో పూరించడానికి సంసిద్ధంగా ఉన్నాం... స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో అలుపెరగని శ్రమజీవులమైన మనం ప్రతి సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలచుకుందాం...దేశ భక్తితో, సామాజిక బాధ్యతతో, క్రమ శిక్ష ణతో మన రాష్ట్ర ప్రగతి కోసం, శ్రేయస్సు కోసం మనమంతా భుజం భుజం కలిపి పనిచేద్దాం... 2022 నాటికి మన రాష్ట్రాన్ని దేశంలో మూడు అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా, 2029 నాటికి దేశంలో అత్యుత్తమ రాష్ట్రంగా, 2050 నాటికి ప్రపంచంలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నిర్ధేశించుకున్నాం... అవినీతి లేని, ఆర్ధిక అసమానతలు లేని, అందరికీ ఉపాధి కల్పించే ఆరోగ్యకరమైన, ఆనందమయమైన రాష్ట్రాన్ని నిర్మించుకుందాం.... ఈ లక్ష్య సాధనకు సమర్పణ భావంతో, నిష్ఠతో, త్రికరణ శుద్ధిగా కృషి చేద్దాం....ఆంధ్రప్రదేశ్ నవ నిర్మాణ దీక్షా లక్ష్యాలను సాధిద్దాం'' అని చంద్రబాబు ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా సీఎం ప్రత్యేక సీడిని ఆవిష్కరించారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
మహానాడులో మొదటి రోజు కార్యక్రమాలు. రాబోయే కాలంలో అనుసరించాల్సిన పంథా ఎలా ఉండాలన్న అంశాన్ని త...
తిరుపతిలో మహానాడుకు తమ్ముళ్ళు సిదమవుతున్నారు
...గిద్దలూరు వైకాపా ఎమ్మెల్యే అశోక్రెడ్డి తెదేపాలో చేరారు. బుధవారం పా...
కొవ్వూరు:తిరుపతి మహానాడుకు గైర్హజరైన తెలుగుదేశంపార్టీ నాయకులు, తెలుగు తమ్ముళ్ళ. ...
తెలుగుదేశం పార్టీ ఆవిర్బవం నుండి తెలుగు దేశం పార్టీకి ఆంద్రాసుగర్స్ యాజమా...
కొవ్వూరునియోజకవర్గం లో టి డి పి పార్టీ లో గ్రూపులు పెరుగుతున్నాయి. పార్టీ అధికారం లోకి రాక ము...
కొవ్వూరునియోజకవర్గంలో వై ఎస్ ఆర్ పార్టీ నాయకురాలు తానేటి వనిత ఒంటెద్దు పోకడ విధానంతో పార్టీలో ఒక ...
పోటీ చేసే ఎంపీ అభ్యర్థులు లేరు.! కానీ 25స్థానాల్లో గెలుస్త...
- కొవ్వూరునియోజకవర్గంలో 2018 రాజకీయా నేతలకు మిశ్రమ ఫలితాలనే ఇచ్చిందనే చెప్పవచు. మ...
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, పశ్చిమగోదావరి జిల్లా ...
జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : తెరాస పార...
తెలంగాణ ఇంటిపార్టీ గోడ పత్రికను నేలకొండపల్లి వివిధ ప్రభుత...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల జనవరి 11,ప్రజాపాలన: మండల...
ఈరోజు ఖమ్మం జిల్లా వైరా లో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య ఐక్యవ...
* చనిపోయిన రైతు కుటుంబాలకు 5 లక్షలతో ఆసరా
* ...
తెలుగు ప్రజల గొంతుక కు వేదికగా ప్రజాపాలన.
...నాడు బహుజనులకు వేదికగా, నేడు తెలుగు ప్రజల గొంతు కగా...
విఆర్ఏలను ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేయడం ద్వారా వారికి రెగ్యులర్ స్కేల్ వచ్చే విధంగా తెలంగ...
కల్వకుంట్ల కుటుంబం నుంచి మరొకరికి కీలక బాధ్యతలు కెసిఆర్ అప్పగించారు , కెసిఆర్ అన్న కల్వకుంట్ల రంగ...
గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గోదావరి నీటిమట...
గతవారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు ప్రజలు తీ...
కుల వృత్తులను తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కలెక్టరేట్ సమ...
తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు వస్తాయని తెలిసి కూడ ప్రభుత్వం పట్టించు...