
సబ్బిడీ సాయం సున్నా.....!
"వ్యవసాయ యంత్రల పరికరాల బడ్జెట్ కేటాయింపులు నిల్"* రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ మంత్రివర్యులు కొత్తపల్లి శామ్యూల్ జవహర్ .
~*
వ్యవసాయ యంత్రపరికరాలపై రైతులకు అందించే సబ్బిడి సాయనికి ఈ ఏడాది ఇప్పటి వరకు బడ్జెట్ కేటాయింపులు జరగలేదని జవహర్ ఆరోపించారు.
ఏటా సగటు నా రూ 18.కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేశావారన,కానీ ఈఏడాది సబ్బిడీ పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని జవహర్ పేర్కొన్నారు.
ప్రభుత్వ ఆసరా తో యంత్రపరికరాలు కొనుగోలు చేయలుఅనుకున్న రైతులు ఆశలు పై నీళ్లు చిమ్మి నట్లు అయ్యిందని జవహర్ ఆవేదన వ్యక్తంచేశారు.
గత ప్రభుత్వలు ఏటా సుమారుగా 13.వేలమంది రైతులు కు 50 శాతం సబ్బిడీ పై యంత్రపరికరాలు అందించే వారని ,కానీ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వo ఇంతవరకు నిమ్మకునీరు ఎత్తినట్లు వ్యవహరిస్తున్నాయని జవహర్ విమర్శించారు.
రైతు దేశానికీ వెన్నుముక అనే విషయన్నీ రాష్ట్ర ప్రభుత్వాo మరిచిపోయాయని జవహర్ ధ్వజమెత్త్తారు.
ఇప్పటికీ అయిన , రాష్ట్ర ప్రభుత్వాo తక్షణమే స్పందించి రైతులకు సబ్బిడీ పరికరాలు కు బడ్జెట్ కేటాయించి రైతులను ఆదుకోవాలని జవహర్ ప్రభుత్వన్నీ కోరారు.
ఈ సబ్బిడి పై ప్రభుత్వ0 తాత్సారం చేస్తే , తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
జవహర్ స్వగృహం వద్ద కొవ్వూరు లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో తెలుగుదేశం పార్టీ జిల్లా తెలుగు యువత నాయకులు పాక జయరామ్. జిల్లా తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ ఉపాధ్యక్షులు పెరుమాళ్ళ సత్యనారాయణ.జిల్లా తెదేపా నాయకులు ముత్యాల రాంబాబు .నందమూరి భద్రం.తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: