మహారాష్ట్ర బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జిగా కల్వకుంట్ల వంశీధర్‌రావు

Published: Saturday July 29, 2023

కల్వకుంట్ల కుటుంబం నుంచి మరొకరికి కీలక బాధ్యతలు కెసిఆర్ అప్పగించారు , కెసిఆర్ అన్న కల్వకుంట్ల రంగారావు  కుమారుడు కల్వకుంట్ల వంశీధర్‌రావును మహారాష్ట్ర  ఇన్‌చార్జిగా కెసిఆర్ నియమించారు , చిరంజీవి మీద అభిమానంతో 2009 లో ప్రజారాజ్యం పార్టీ తో రాజకీయాలోకి వొచ్చిన కల్వకుంట్ల వంశీధర్‌రావు,అనంతరం చాలాకాలం రాజకీయాలకు దూరంగా వున్నారు , ఇటీవల కొంతకాలంగా బాబాయి కేసీఆర్‌కు దగ్గరగా మెలగుతున్నారు. కల్వకుంట్ల రంగారావుకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. వీరిలో ఒకరు వంశీధర్‌రావు కాగా, మరో కుమారుడు కల్వకుంట్ల కన్నారావు రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్‌గా లేరు. రంగారావు కూతురు రమ్యారావు మాత్రం కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతున్నారు.