ఉత్సాహంగా ముగిసిన క్రికెట్ టోర్నమెంట్:: అన్న ఫౌండేషన్
*యువత క్రీడారంగంలో ముందుకు సాగాలి: రాణి రుద్రమదేవి*
*కృషితో సాధించలేనిది ఏమీ లేదు:: వంకాయలపాటి నాగేశ్వరరావు*
*గెలుపు ఓటములు శాశ్వతం కాదు నిత్యం సాధన ఉండాలి:: పాటిబండ్ల సత్యంబాబు*
*విద్యతో పాటుగా పట్టుదల ఉండాలి:: ఇక్బాల్ మాధవి ఎర్రగుంట రమేష్*
గత 12 రోజులుగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రాంగణంలో ఫ్రెండ్స్ యూత్ మెగా క్రికెట్ టోర్నమెంట్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ముగింపు ఫైనల్ పోటీ ఆత్కూరు వర్సెస్ మధిర మధ్య ఉత్కంఠభరితంగా సాగింది
ఈ పోటీలో మొదటి బహుమతి గా విజేతలైన *ఆత్కూరు టీంకు 12116/- రూపాయల నగదును మరియు ట్రోఫీని *అన్న ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్ మేళం మరియు రాణి రుద్రమదేవి కౌన్సిలర్ ఎర్రగుంట లక్ష్మి రమేష్ మాధవి ప్రెస్ మిత్రులు అందజేశారు*
ఈ సందర్భంగా పాల్గొన్న వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ గెలుపు ఓటములను పోర్టుగా తీసుకోవాలని యువత పాటు పట్టుదలతో కృషి చేస్తే సాధించలేనిది ఏమీ ఉండదని మధిర నుండి రాష్ట్రస్థాయిలో ఆడడం కోసం యువ క్రికెటర్ తమ నైపుణ్యాన్ని పెంచుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు
Share this on your social network: