క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన జడ్పిటిసి.

Published: Friday February 05, 2021

జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన.

జన్నారం మండల కేంద్రంలో నాలుగు మండలాలకు చెందిన క్రికెట్ టోర్నమెంట్ ను గురువారం జెడ్ పి టి సి చంద్రశేఖర్ ప్రారంభించారు. లక్షట్ పేట దండ పెళ్లి జన్నారం కడం తదితర నాలుగు మండలాలకు చెందిన క్రీడాకారులు ఉంటున్నారు. జన్నారం జేఏసీ ఆధ్వర్యంలో ఈ క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు హమీద్ సలీం తెలిపారు. మొదటి బహుమతి గా రూపాయలు 25000, రెండవ బహుమతి గా రూపాయలు పన్నెండు వేల ఐదు వందల ను అందజేస్తున్నట్లు వారు తెలిపారు. క్రీడాకారులు  సమయపాలన పాటించి టోర్నమెంటు సజావుగా సాగు టట్లు సహకరించగలరు అన్నారు.