మున్సిపల్ లో పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి: ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

Published: Tuesday February 09, 2021
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపాలన ) : మున్సిపల్ పరిధిలోని పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వికారాబాద్ మునిసిపాలిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..గత సవంత్సర కాలంగా ఇంజినీరింగ్, శానిటేషన్, టౌన్ ప్లానింగ్ మొదలగు శాఖలలో పూర్తయిన పనులు, నడుస్తున్న పనులు, ఇంకా చెయ్యాల్సిన పనుల గురించి విస్తృతంగా చర్చించామని అన్నారు. అలాగే
పెండింగ్ లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.  ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల, వైస్ చైర్ పర్సన్ శంషాద్ బేగం, మున్సిపల్ కమిషనర్ భోగీశ్వర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.