విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి ** ఎంపీపీ అరిగెల మల్లికార్జున్

Published: Thursday August 25, 2022
ఆసిఫాబాద్ జిల్లా ఆగస్టు 24 (ప్రజాపాలన, ప్రతినిధి) : గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఆసిఫాబాద్ ఎంపిపి అరిగెల మల్లికార్జున్ యాదవ్ అన్నారు. బుధవారం మండలంలోని బాబాపూర్ కు వెళ్లే రోడ్డులో గల జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని తెలిపారు. పాఠశాల కు వస్తున్న సరుకులు నాణ్యత లేకుంటే వాపస్ పంపించాలని సూచించారు. విద్యార్థులకు కావలసిన సౌకర్యాలు కల్పించడానికి తగిన సహకారం అందిస్తామని ఉపాధ్యాయులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సావిత్రి,మల్లేష్, ఎం ఈ ఓ,పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.