పల్లె ప్రగతిలో శ్రమదానం

Published: Saturday June 11, 2022

సర్పంచ్ అనుమల తిరుపతి

వెల్గటూర్, జూన్ 10 (ప్రజాపాలన ప్రతినిధి) :  వెల్గటూర్ మండలం మూత్తునూర్ గ్రామంలో  పల్లె ప్రగతి లో భాగంగా ప్రభుత్వ పాఠశాల వద్ద సర్పంచ్ అనుమల తిరుపతి ఆధ్వర్యంలో శుక్రవారం శ్రమదానం నిర్వహించారు. పాఠశాల వద్ద పిచ్చి మొక్కలను తొలగించారు. గ్రామము నుండి పాఠశాల వరకు రహదారికి ఇరువైపులా పిచ్చి మొక్కలను తొలగించిన ఈ కార్యక్రమాంలో ఉప సర్పంచ్ గొల్ల మల్లమ్మ, గ్రామ ప్రత్యేక అధికారి ఆర్.ఐ‌ స్వామి,కార్యదర్శి రంజిత్ కుమార్, పాలకవర్గ సభ్యులతో ప్రజలతో కలిసి శ్రమదానం నిర్వహించారు.అంగన్ వాడీ ఉపాధ్యాయులు జక్కా పురం రుక్మిణి, సంఘ ప్రేమ లత, ఆశా వర్కర్ గవ్వల యమున, గొల్ల సత్యం, మహిళ సంఘ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.