బుచ్చిరెడ్డిపాలెంనక్కల గరువు లో వైకుంఠదామాన్ని ప్రారంబించిన

Published: Monday May 30, 2022

జిల్లా పరిషత్ చైర్మన్ మధిర మే 28 ప్రజా పాలన ప్రతినిధి మండలం పరిధిలో శనివారం నాడు బుచ్చిరెడ్డిపాలెం లోనిర్మించిన వైకుంఠదామాన్ని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు, రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరావు ప్రారంభించారు.దీంతోపాటు గ్రామంలో కొత్తగా నిర్మించే సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మునగా వెంకట్రావమ్మా,మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, రైతుబంధు మండల కన్వీనర్ చావా వేణు,ఆత్మకమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, వీరబాబు గ్రామస్తులు పాల్గొన్నారు.