వాసవీక్లబ్స్ ఆధ్వర్యంలో 24 గంటల నిరంతర భజన
మంచిర్యాల వాసవీక్లబ్స్ ఆధ్వర్యంలో స్థానిక విశ్వనాథ స్వామి కాలక్షేప మండపంలో 24 గంటల ఎక్కాహం అఖండ భజన ఆదివారం ఘనంగా నిర్వహించారు. వాసవీక్లబ్స్ ఆధ్వర్యంలో మంచిర్యాల విశ్వనాధస్వామి ఆలయంలోని వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి సన్నిధిలో నెల రోజుల వైశాఖ మాసం అమ్మవారి ఉత్సవాలలో భాగంగా బెల్లంపల్లి భజన బృందం వారిచే 24 గంటల భజన కార్యక్రమాన్ని వాసవి క్లబ్ ల సంయుక్త సౌజన్యంతో ఎక్కహం భజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ భజన సోమవారం రోజున ఉదయం 10 గంటలకు పరిసమాప్తి అవుతుంది. ఈ కార్యక్రమంలో వాసవీక్లబ్స్ అంతర్జాతీయ ఉపాధ్యక్షులు ముక్తా శ్రీనివాస్, రేణికుంట్ల శ్రీనివాస్, గవర్నర్ బాల సంతోష్, కార్యదర్శి బోనగిరి వేణుగోపాల్, కోశాధికారి పుల్లూరి బాల మోహన్, రీజియన్ ఛైర్మన్ వుత్తూరి రమేష్, కార్యదర్శి నాగిశెట్టి శ్రీనివాస్, జిల్లా ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి చిలువేరు శ్రీనివాస్, వాసవిక్లబ్ అధ్యక్షుడు కేశెట్టి వంశీకృష్ణ, కార్యదర్శి నలుమాసు ప్రవీణ్, యూత్ క్లబ్ అధ్యక్షుడు మల్యాల యోగేశ్వర్, కోశాధికారి బోనగిరి సాయి , మాజీ అధ్యక్షుడు పాత సాయి సూరజ్, కపుల్స్ అధ్యక్షులు గడ్డం రమాదేవి రమేష్, కోశాధికారి బజ్జూరి శ్రీవాణి శ్రీనివాస్, బెల్లంపల్లి భజన బృందం సభ్యులు చిలువేరు దయాకర్ వాసవిక్లబ్ ల సభ్యులు పాల్గొన్నారు.
Share this on your social network: