సేవా సదనం లో లోమానసిక దివ్యాంగులకు అన్న వితరణ

Published: Thursday January 20, 2022

మధిర జనవరి 19 ప్రజా పాలన ప్రతినిధి ఈరోజు డాక్టర్ వసంతమ్మగారి సేవాసదనము మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల లో వాస్తవ్యులు శ్రీ అల్లూరి శ్రీనివాసరావు కుమారి కుమారుడు గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా అన్న వితరణ నిర్వహించారు ఈ వితరణ కార్యక్రమం ముఖ్య అతిథులుగా మధిర శివాలయం మాజీ చైర్మన్ మధిర సేవ సమితి ఉపాధ్యక్షుడు శ్రీ కోమటిడి శ్రీనివాస రావు ముఖ్య అతిథులుగా విచ్చేసి అన్న వితరణ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ మానసిక దివ్యాంగులకు సమాజంలో చిన్న చూపు గురవుతున్న మానసిక దివ్యాంగులకు ప్రతి ఒక్కరూ చేయూతను అందించాలి ఈ కార్యక్రమంలో మేడ వెంకటేశ్వరరావు ప్రజాపాలన రిపోర్టర్ పసుపులేటి నాగేంద్ర శ్రీనివాస్ రావు సేవా సదనం సిబ్బంది నారి కుమారు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సేవా సదనం డైరెక్టర్ డాక్టరు కె షీలారాము గారు మాట్లాడుతూ పుట్టినరోజు నాడు ఆర్భాటాలకు పోకుండా మానసిక దివ్యాంగులకు అన్న వితరణ చేసిన దాతలకు మరియు విచ్చేసిన అతిథులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు