ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి జుక్కల్ కిష్టా గౌడ్ కు చికిత్స ఖర్చులు మంజూరు చేయించిన ఖేడ్ శాస

Published: Thursday January 20, 2022
హైదరాబాద్ 18 జనవరి ప్రజాపాలన ప్రతినిధి: జుక్కల్ కిష్టా గౌడ్ కు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రెండు లక్షల రూపాయలను మంజూరు చేయించిన ఖేడ్ శాసన సభ్యులు భూపాల్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని శంకరంపేట్ (అ) మండలం జుక్కల్ గ్రామానికి చెందిన కె.మనెమ్మ భర్త కిష్టగౌడ్ అనారోగ్యం కారణంగా నిమ్స్ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. నిమ్స్ లో చికిత్స పొందుతున్న కిష్టా గౌడ్ కు వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రెండు లక్షల రూపాయలను నారాయణ్ ఖేడ్ శాసన సభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి మంజూరు చేయించారు. దీనికి సంబంధించిన లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్.ఓ.సి.) ప్రతిని కుటుంబ సభ్యులకు మంగళవారం నాడు అందజేశారు. నిరుపేదలకు మెరుగైన వైద్య సాయం పొందేందుకు ముఖ్య మంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటుందని, ఎవరు కూడా ఆధైర్య పడోధ్ధని శాసన సభ్యులు అన్నారు. ఈ సందర్భంగా బాధితుని కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వైద్య ఖర్చులను మంజూరు చేయించిన నారాయణ్ ఖేడ్ శాసనసభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు.