లలితాంబ కరాజా రాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో ముగ్గులు పోటీలు
Published: Monday January 17, 2022
మధిర జనవరి 16 ప్రజాపాలన ప్రతినిధి : ఎర్రుపాలెం మండలం తక్కెళ్ళ పాడు గ్రామంలో వేం చేసియున్న శ్రీ లలితాంబికా రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో డీసీసీబీ డైరెక్టర్ శ్రీ అయిలూరి వెంకటేశ్వర రెడ్డి మరియు చెరుకూరి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ముగ్గుల పోటీలలో ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులను గ్రామస్తుల సహకారంతో అందివ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో న్యాయనిర్నెతలుగా శ్రీమతి యడ్లపల్లి నటరాజ్ కుమారిటీచర్ డాక్టర్ శ్రీమతి పాతూరి పద్మావతి మరియు శ్రీమతి తుమ్మలపూడి గీతీకా కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తక్కలపాడులో వేసి ఉన్న లలిత రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో ముగ్గుల పోటి నిర్ణయించటం అమ్మవారి దీవెనలు ముగ్గుల పోటి నిర్ణయించటం అమ్మవారి దీవెనలు అందరికీ ముగ్గుల పోటి నిర్ణయించటం అమ్మవారి దీవెనలు అందరికీ ఉంటాయని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి consolation బహుమతి ప్రదానం కూడా జరిగింది. గ్రామ సర్పంచ్ శ్రీమతి కూరపాటి సుందరమ్మ ఎంపీటీసీ శ్రీమతి కూరపాటి యశోద వైస్ ప్రెసిడెంట్ శ్రీ అయిలూరి నాగిరెడ్డి మాజీ ఎంపీటీసీ శ్రీమతి శీలం అక్కమ్మ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
Share this on your social network: