నేడు నవాబ్ పేట్ మండల కేంద్రంలో రైతుబంధు వారోత్సవాలు

Published: Wednesday January 12, 2022
టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కందాడ నాగిరెడ్డి
వికారాబాద్ బ్యూరో 11 జనవరి ప్రజాపాలన : రైతుబంధు పథకం 50 వేల కోట్ల రూపాయలు లబ్దిదారుల ఖాతాల్లో జమ అయిన సందర్భాన్ని పురస్కరించుకుని రైతుబంధు వారోత్సవాలు మండల కేంద్రంలోని రైతువేదిక దగ్గర నిర్వహించనున్నామని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కందాడ నాగిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేవెళ్ళ ఎమ్మెల్యే కాలె యాదయ్య హాజరుకానున్నారని పేర్కొన్నారు. రైతుబంధు వారోత్సవాలను విజయవంతం చేయడానికి ప్రతి టిఆర్ఎస్ కార్యకర్త రామదండులా కదిలి రావాలని పిలుపునిచ్చారు.