ముఖ్యమంత్రిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను చూడటమే ధ్యేయం..

Published: Tuesday December 28, 2021
సత్తుపల్లి నియోజకవర్గ ఇంచార్జీ తిరుమలరావు..
తల్లాడ, డిసెంబర్ 27 (ప్రజాపాలన న్యూస్): తెలంగాణ రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని బీఎస్పీ సత్తుపల్లి నియోజకవర్గ ఇంచార్జి తేళ్ళూరి తిరుమల పిలుపునిచ్చారు. మంగళవారం తల్లాడ మండలం లోని పాత మిట్టపల్లి గ్రామంలో ఆ పార్టీ సత్తుపల్లి నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమలరావు మాట్లాడుతూ బహుజన వాదాన్ని బలంగా వినిపిస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు ప్రతి కార్యకర్త శక్తివంచన లేకుండా పార్టీ బలోపేతం లక్ష్యంగా పని చేయాలన్నారు. గతంలో ఓట్లు మావి.. సీట్లు మీవా.. అన్నచందంగా ఉందని అలాకాకుండా ఓట్లు మావే.. సీట్లు మవే లాగా ఐక్యంగా పని చేయాలన్నారు. బీఎస్పీ అధినేత్రి బెహన్ కుమారి మాయావతి తెలంగాణపై దృష్టి సారించారని, తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పగ్గాలు చేపట్టడం ఖాయమని జోస్యం చెప్పారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం మాటలకే పరిమితమైందని, కాంగ్రెస్, బిజెపి పార్టీల వల్ల ఎటువంటి ఉపయోగం లేదన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో తిరుగులేని శక్తిగా బహుజన సమాజ్ పార్టీ అవతరించబోతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు బుర్ర ఉపేంద్ర సాహూ, జిల్లా ఇన్చార్జి మేకతోటి పుల్లయ్య, మట్టే గురుమూర్తి, ఇందొజు భద్రగిరి, గజ్జల నారాయణ, తదితరులు పాల్గొన్నారు.